Reading Time: < 1 minute
ఆర్టీసీ బస్సు నడిపిన ఎమ్మెల్యే.. వైరల్ అవుతున్న వీడియో

బస్సు ప్రయాణంలో భాగంగా ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు దివ్యాంగులతో ముచ్చటించారు. వారికి స్వయంగా ఉచిత ప్రయాణ టికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన .. దివ్యాంగుల సాధికారతకు ఈ పథకం ఎంతో దోహదపడుతుందని ఆకాంక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలన్న చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈ పథకం ద్వారా సుమారు 11 లక్షల మందికి పైగా దివ్యాంగులకు లబ్ధి చేకూరుతుందని, వారి ప్రయాణ కష్టాలు తీరుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, స్థానిక నేతలు మరియు పెద్ద ఎత్తున దివ్యాంగులు పాల్గొన్నారు.