
తెలంగాణలో ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు భవిష్యత్తుపై బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ కీలక ప్రశ్నలు లేవనెత్తారు. గ్లోబల్ సమ్మిట్లలో ప్రకటించిన పెట్టుబడులు, అవగాహన ఒప్పందాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రి శ్రీధర్ బాబును ఆయన కోరారు. టీఎస్-ఐపాస్ వెబ్సైట్ గత పదేళ్లలో అత్యంత పేలవమైన పనితీరును చూపుతోందని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వం 14,000 ఎకరాలలో ఫార్మా సిటీ కోసం సేకరించిన భూమిని, ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ వంటి పేర్లతో మళ్లిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఫార్మా కోసం షరతులతో కూడిన ఈ భూమిని ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్లాట్లు ఇవ్వడానికి, స్టేడియాలు, జూ పార్కులు నిర్మించడానికి ఉపయోగించలేరని ఆయన స్పష్టం చేశారు. ఫార్మా సిటీ రద్దు కాలేదని కోర్టుకు చెబుతూ, బయట మాత్రం దానిని ఫ్యూచర్ సిటీగా ప్రచారం చేయడంలో వైరుధ్యం ఉందని కేటీఆర్ అన్నారు. కాలుష్య కారక పరిశ్రమల మధ్యలో నివాస సముదాయాలు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పారిశ్రామికవేత్తలకు నమ్మకం ఎలా కుదురుతుందని ఆయన సందేహం వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీ డబ్బు – మీ హక్కు !! బ్యాంకుల్లో మర్చిపోయిన వేల కోట్లు.. ఆర్బీఐ సరికొత్త ప్రచారం
సిలిండర్ కోసం ‘చెప్పుల’ క్యూ !! ప్రజలకు తీరని గ్యాస్ కష్టాలు !!