
కాకినాడ, పోలవరం జిల్లాల్లో గత 15 రోజులుగా పెద్దపులి సంచారం స్థానిక ప్రజలను, అధికారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. “చిక్కదు, దొరకదు” అన్నట్లుగా సవాల్ విసురుతున్న ఈ పులి కారణంగా జనంలో గజగజా వణుకు పుట్టింది. టీవీ9 నివేదిక ప్రకారం, ప్రస్తుతం ఈ పెద్దపులి సంచారం కాకినాడ జిల్లా శంఖవరం మండలంలోని కొండేపూడి చెరువు ప్రాంతంలో కొనసాగుతున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనతో కాకినాడ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. రైతులు, స్థానికులు పులి సంచారంతో భయపడుతున్నారు. చెరువులు, కాలువల దగ్గర పులి ఉండే అవకాశముందని అటవీ అధికారులు వార్నింగ్లు జారీ చేస్తున్నారు. దీంతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను అలెర్ట్ చేస్తున్నారు. స్థానిక అధికారులు, అటవీ శాఖ అధికారులు పెద్దపులిని ట్రాక్ చేయడానికి, సురక్షితంగా పట్టుకోవడానికి సంఘటన స్థలానికి చేరుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
50 ఏళ్లుగా గ్యాస్ వాడకుండానే..నడుస్తున్న హోటల్
Malla Reddy: పెళ్లి అంటే భయపడేవారికి మల్లారెడ్డి మెసేజ్! ఈ వీడియో తప్పక చూడండి
Malla Reddy: మల్లారెడ్డి పార్టీ మారుతున్నారా? యాంకర్ ప్రశ్నకు దిమ్మతిరిగే రిప్లై