Reading Time: < 1 minute
Preity Zinta Sells Mumbai Luxury Apartment For 18 Crores Real Estate Updates

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్, పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతీ జింటా ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. బాంద్రాలోని అత్యంత సంపన్న ప్రాంతమైన ‘పాలి హిల్’లో తనకున్న లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను ఆమె తాజాగా రూ. 18.50 కోట్లకు విక్రయించారు. విశేషం ఏంటంటే, గత నాలుగు నెలల్లోనే ఆమె ఇలా భారీ ఆస్తిని అమ్మేయడం ఇది రెండోసారి.

Also Read : Yami Gautam: హీరోయిన్ అడిగితే తప్పా? షూటింగ్ టైమింగ్స్‌పై యామీ గౌతమ్ ఫైర్!

గతేడాది నవంబర్‌లో ఇదే ‘రుస్తోమ్‌జీ పరిశ్రమ్’ బిల్డింగ్‌లోని 11వ అంతస్తులో ఉన్న ఒక ఫ్లాట్‌ను ప్రీతి రూ. 14 కోట్లకు పైగా ధరకు విక్రయించారు. ఇప్పుడు తాజాగా అదే అంతస్తులో ఉన్న మరో 1,770 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను మార్చి 2, 2026న అమ్మేశారు. ఈ డీల్ కోసం కొనుగోలుదారులు దాదాపు రూ. 1.11 కోట్ల స్టాంప్ డ్యూటీ కూడా చెల్లించినట్లు సమాచారం. మరి ప్రీతీ జింటా ఇలా వరుసగా ఆస్తులు విక్రయించడం వెనుక ఒక పెద్ద ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది. బాంద్రాలోనే దాదాపు రూ. 100 కోట్ల విలువైన ఒక భారీ ప్రాపర్టీని కొనుగోలు చేసేందుకు ఆమె సిద్ధమవుతున్నారని, అందుకే ఈ చిన్న చిన్న ఆస్తులను అమ్మేసి ఆ సొమ్మును అక్కడ ఇన్వెస్ట్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది.

కేవలం ప్రీతి మాత్రమే కాదు, ఇటీవల కాలంలో అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోలు కూడా భారీ రియల్ ఎస్టేట్ డీల్స్ చేస్తున్నారు. 2025లో అక్షయ్ కుమార్ తన ఆస్తుల ద్వారా రూ. 100 కోట్లకు పైగా ఆర్జించగా, బిగ్ బి కూడా అదే రేంజ్‌లో డీల్స్ కుదుర్చుకున్నారు. తాజాగా జీతేంద్ర, ఏక్తా కపూర్ కూడా తమ అపార్ట్‌మెంట్‌ను రూ. 12.25 కోట్లకు విక్రయించి వార్తల్లో నిలిచారు.