Reading Time: < 1 minute

హైదరాబాద్: తన పేరుతో కొందరు సంస్థలు ఏర్పాటు చేసిన విషయంపై మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్పందించారు. తన పేరుతో ఎలాంటి సంస్థల నిర్వహణకు అనుమతి లేదని కెటిఆర్ స్పష్టం చేశారు. ఎవరైనా పని చేయాలనుకుంటే బిఆర్ఎస్‌తో కలిసి పని చేయాలని.. తన పేరుతో సంస్థలు ఏర్పాటు చేసేందుకు మాత్రం అనుమతి లేదని పేర్కొన్నారు. ఇలాంటి సంస్థలకు ఎలాంటి గుర్తింపు, అనుమతి లేదన్నారు. తన పేరుతో పలు సంస్థల ద్వారా చేస్తున్న కార్యక్రమాలు వెంటనే ఆపాలని తెలిపారు. తనపై అభిమానం ఉంటే బిఆర్ఎస్‌తో కలిసి పని చేయవచ్చని పిలుపునిచ్చారు.