
ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు మరోసారి విద్వంసం సృష్టించారు. హోమ్ గ్రౌండ్ ఉప్పల్లో పరుగుల వరద పారించిన ఆరెంజ్ ఆర్మీ ఓపెనర్లు, కేవలం 3 ఓవర్లలోనే జట్టు స్కోరును యాభై మార్కు దాటించి సరికొత్త రికార్డును నెలకొల్పారు.
IPL చరిత్రలో SRH అత్యంత వేగవంతమైన 50 పరుగులు ఇలా ఉన్నాయి. 2.4 ఓవర్లలో.. ఢిల్లీ క్యాపిటల్స్పై (ఢిల్లీ, 2024), 3.1 ఓవర్లలో.. లక్నో సూపర్ జెయింట్స్పై (హైదరాబాద్, 2024), ఇప్పుడు ఈ మ్యాచ్ లో 3.2 ఓవర్లలోనే పంజాబ్ కింగ్స్పై (హైదరాబాద్, 2026) 50 పరుగులు సాధించారు.
పవర్ ప్లే ముగిసేసరికి విధ్వంసకర స్కోరు..
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు. మొదటి బంతి నుంచే పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.
పవర్ ప్లే (6 ఓవర్లు) ముగిసేసరికి SRH 79/1 పొజిషన్లో ఉంది. అభిషేక్ శర్మ 13 బంతుల్లో 35 పరుగులు (2 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి ఔట్ అయ్యాడు. ట్రావిస్ హెడ్ 16 బంతుల్లో 35 పరుగులు, ఇషాన్ కిషన్.. 7 బంతుల్లో 7 పరుగులతో నాటౌట్గా ఉన్నారు. అభిషేక్ శర్మ 3.3 ఓవర్ల వద్ద 54 పరుగుల స్కోరు వద్ద మొదటి వికెట్గా వెనుదిరిగినప్పటికీ, అప్పటికే జట్టును భారీ స్కోరు దిశగా నడిపించాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ 2 ఓవర్లలో 27 పరుగులు, మార్కో జాన్సెన్ 2 ఓవర్లలో 32 పరుగులు సమర్పించుకున్నారంటే హైదరాబాద్ బ్యాటర్ల ధాటి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పవర్ ప్లేలోనే 79 పరుగులు సాధించిన సన్ రైజర్స్, ఈ మ్యాచ్లో భారీ లక్ష్యాన్ని నిర్దేశించే దిశగా సాగుతోంది.