
సమంత హీరోయిన్గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’. నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని, సమంత స్వయంగా తన ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్ మీద నిర్మిస్తోంది. అయితే, ఈ సినిమా ముందుగా ప్రకటించిన ప్రకారంగా మే 15వ తేదీన రావాల్సి ఉంది. కానీ మే 6వ తేదీ వచ్చినా ఇంకా ప్రమోషన్స్ మొదలుకాలేదు.
అయితే, ఈ సినిమా రిలీజ్ కాకపోవచ్చు అని అంచనాలు ముందు నుంచి ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్లు జూన్ 4వ తేదీన రిలీజ్ చేయమని కోరినట్లు ఆమధ్య వార్తలు రాగా, ఆ వార్తలు వచ్చిన రెండు మూడు రోజుల్లోనే.. అదే జూన్ 4వ తేదీన ‘పెద్ది’ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఈ సినిమా ఎప్పుడు వస్తుందో అనే అనుమానాలను నివృత్తి చేస్తూ, సినిమాని జూన్ 19వ తేదీ రిలీజ్ చేస్తున్నట్లు టీం ప్రకటించింది.
ఐపీఎల్ సీజన్లో క్లాష్ ఉండకూడదు అనే ఉద్దేశంతోనే వాయిదా వేసినట్లు ప్రకటించింది. కానీ తెరవెనుక ఈ సినిమాకి సెన్సార్ అడ్డంకులు కూడా ఏర్పడినట్లుగా తెలుస్తోంది. సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే టైటిల్ మార్చమని కూడా కోరినట్లుగా వార్తలు వస్తున్నాయి. దానికి తోడు మే 15 నుంచి 30 వరకు ఐపీఎల్ క్లైమాక్స్ మ్యాచులు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే యువత అంతా మ్యాచుల వైపు ఆకర్షితులవుతారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకూడదని టీం ఈ నిర్ణయం తీసుకుని ఉండి ఉండవచ్చు.