
రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో భారీ స్కోరు సాధిస్తాడని అంచనా. సూర్యవంశీ మొదటి బంతి నుంచే భారీ షాట్లు ఆడుతూ దూకుడు ప్రదర్శిస్తుంటాడు. అగ్రశ్రేణి బౌలర్ల బౌలింగ్లో కూడా సునాయాసంగా ఆడుతూ కనిపిస్తాడు. ఈ కారణంగానే వైభవ్ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ సమయంలో, భారత మాజీ క్రికెట్ ఆటగాడు, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ వైభవ్ లోని లోపాలను ఎత్తిచూపాడు.
స్పోర్ట్స్టార్తో మాట్లాడుతూ, భారత మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్, వర్ధమాన ఆటగాడు వైభవ్ సూర్యవంశీలోని లోపాలను ఎత్తిచూపుతూ ఇలా అన్నారు, “గత కొన్నేళ్లుగా టీ20 బ్యాట్స్మెన్లను చూస్తే, సూర్యవంశీ ఎక్కువగా లెగ్ సైడ్లో ఆడతాడు. అతను బంతికి లెగ్ సైడ్లో ఉండటం వల్ల, మిడిల్ స్టంప్ బంతిని పాయింట్ మీదుగా కొడతాడు. టెస్ట్ క్రికెట్లో బంతికి దగ్గరగా ఉండటం మంచిది. బంతికి దూరంగా ఉంటే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలో కనీసం 20 పరుగులు కూడా చేయలేడు.” అని తెలిపాడు.
ఈ విషయంపై సంజయ్ మంజ్రేకర్ మరింతగా మాట్లాడుతూ.. “మీ బిడ్డ ప్రసిద్ధి చెంది, ధనవంతుడు కావాలని మీరు కోరుకుంటే, అప్పుడు టీ20 బ్యాటింగ్ మీకు సరైనది. కానీ విమర్శకుల నుండి, మాలాంటి వారి నుండి గౌరవం పొందాలని మీరు కోరుకుంటే, బంతి లైన్కు మరింత దగ్గరగా వెళ్లేలా అతడిని సిద్ధం చేయండి.” అని సలహా ఇచ్చారు.
ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ దాదాపు ప్రతి మ్యాచ్లో పరుగులు సాధిస్తూ, చాలా ప్రమాదకరమైన బ్యాట్స్మన్గా మారుతున్నాడు. దీని గురించి సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ, “భారత టీ20 జట్టులోకి ప్రవేశించడానికి ఐపీఎల్ను ఒక వేదికగా, అలాగే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతని ప్రదర్శనను (మహారాష్ట్రపై సెంచరీ) దృష్టిలో ఉంచుకుంటే, వైభవ్ ఇప్పటికే చాలా చేశాడని నేను భావిస్తున్నాని ప్రశంసలు కురిపించాడు.