Reading Time: < 1 minute
Supreme Court Lifts Suspension Karnataka Ex Dgp Ramachandra Rao Reinstated

కర్ణాటక మాజీ డీజీపీ రామచంద్రరావుకు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. ఆయనపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసి.. తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. క్రమశిక్షణా చర్యల ప్రక్రియ పెండింగ్‌లో ఉన్నందున జనవరి 2026లో విధించిన సస్పెన్షన్‌‌ను ఐఏఎస్ నిబంధనల ప్రకారం ఎత్తివేసింది.

రామచంద్ర రావు కర్ణాటక డీజీపీగా ఉన్నారు. అయితే కార్యాలయంలో పలువురు యువతులతో సన్నిహితంగా మెలిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. యువతులకు ముద్దులు పెడుతూ కనిపించారు. దీంతో సిద్ధరామయ్య ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. రామచంద్రరావు ప్రవర్తన నిబంధనలకు విరుద్ధమని.. ఒక ప్రభుత్వాధికారిగా అశ్లీలంగా ప్రవర్తించారని.. ఇది ప్రభుత్వానికి అవమానకరమని సస్పెన్ష్‌లో పేర్కొంది.

అయితే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. తాజాగా సస్పెన్షన్ ఎత్తివేసింది. తక్షణమే విధుల్లో చేర్చుకోవాలని ఆదేశించింది. ఇక పూర్ణచంద్రరావు దత్తపుత్రిక రన్యారావు కూడా 2025 మార్చిలో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడింది. దీంతో అప్పటి నుంచి ఆమె జైల్లోనే ఉంది.