
నితిన్ తదుపరి చిత్రం ఎట్టకేలకు లాంఛనంగా ప్రారంభమైంది. ‘తమ్ముడు’ సినిమా ఫలితం తర్వాత కాస్త సుదీర్ఘ విరామం తీసుకున్న ఆయన, ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమాతో నారి సిరిసవాడ, సోమశేఖర్ టి దర్శకులుగా ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. బుధవారం జరిగిన పూజా కార్యక్రమంతో ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటించారు. నితిన్ సరసన టాలెంటెడ్ బ్యూటీ రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తోంది.
ప్రముఖ సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తుండగా, అనిత్ మదాడి సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నారు. జానీ షేక్ ఆర్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఒక పర్ఫెక్ట్ టెక్నికల్ టీమ్తో దృశ్యపరంగా ఈ సినిమాను అద్భుతంగా మలిచేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ఈ నెల (మే) రెండో వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి చిత్ర యూనిట్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన మరిన్ని సర్ప్రైజింగ్ వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.