
Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్లో ప్రముఖ హిందూ నాయకుడు ధీరేంద్ర ప్రతాప్ సింగ్ను కాల్చి చంపాను. లక్నోలోని దుబగ్గా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక కాలువలో ఆయన మృతదేహం లభ్యమైంది. అతడి ఫార్చ్యూనర్ కారులోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అదే కారులో మృతదేహాన్ని తీసుకెళ్లి, కాలువలో పడేశారు. ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ధీరేంద్ర ప్రతాప్ సింగ్ సొంత ఊరు ఉన్నావ్ అయినప్పటికీ, లక్నోలో నివాసం ఉంటున్నారు. భూ వివాదం కారణంగా ఈ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. ధీరేంద్ర డ్రైవర్ పాత్రపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ నేరం చేయడానికి అతడి ప్రత్యర్థులతో కుట్ర పన్ని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో హత్యను దర్యాప్తు చేస్తున్నారు. హత్య వెనక కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.