
Sachin Tendulkar, Kapil Dev: భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాడు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత సులభం కాదు. సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్, సునీల్ గావస్కర్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్.. ఇలా ఎన్నో దిగ్గజాల పేర్లు వినిపిస్తాయి. అయితే, మాజీ భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం తనదైన శైలిలో ఈ చర్చకు సమాధానం ఇచ్చాడు.
ఓ స్పెషల్ ‘కేటగిరీ’లో భారత క్రికెట్ దిగ్గజాలను ఒకరితో ఒకరిని పోల్చిన అశ్విన్.. చివరికి సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్లను ఫైనల్కు చేర్చాడు. ఆ తుది పోరులో మాత్రం తన ఆల్టైమ్ గ్రేట్గా సచిన్ టెండూల్కర్ను ఎంపిక చేశాడు.
తొలి రౌండ్ నుంచే ఆసక్తికర నిర్ణయాలు..
అశ్విన్ ఎంపిక ప్రక్రియలో పలువురు దిగ్గజాలు పోటీపడ్డారు. సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, సునీల్ గావస్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, జస్ప్రీత్ బుమ్రా తదితరులు ఇందులో ఉన్నారు.
ఎక్కువమంది చదివినది: IND vs SL: తప్పు చేశారు గంభీర్.. ఆ ఒక్కడికి చోటిచ్చి ఉంటే ఈజీగా గెలిచేవాళ్లు..!
సచిన్ టెండూల్కర్ను విజయ్ హజారేపై అశ్విన్ ఎంచుకున్నాడు. మరోవైపు రోహిత్ శర్మతో పోల్చినప్పుడు విరాట్ కోహ్లీకి ఓటేశాడు. తన పేరు కూడా బ్రాకెట్లో రావడంతో సౌరవ్ గంగూలీతో తలపడే సందర్భంలో మాత్రం అశ్విన్ తనకంటే గంగూలీనే ఎంచుకున్నాడు.
కోహ్లీని కాదని బుమ్రాకు ఓటు..!
అశ్విన్ చేసిన ఎంపికల్లో అత్యంత ఆసక్తికరమైనది విరాట్ కోహ్లీ–జస్ప్రీత్ బుమ్రా పోటీ. ఇద్దరిలో ఎవరిని ఎంచుకోవాలన్న విషయంలో తాను కొంత తడబడ్డానని అశ్విన్ పేర్కొన్నాడు.
కోహ్లీ టెస్టు క్రికెట్తో పాటు అన్ని ఫార్మాట్లలో సాధించిన ఘనతలను గుర్తు చేసుకున్నప్పటికీ.. చివరికి బుమ్రా వైపు మొగ్గు చూపాడు. అంటే, తన దృష్టిలో ఆల్ఫార్మాట్ ప్రభావం విషయంలో బుమ్రా ముందున్నాడని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
ధోనీని దాటిన సెహ్వాగ్..
మరో ఆసక్తికర పోరులో వీరేంద్ర సెహ్వాగ్, ఎంఎస్ ధోనీ ఎదురుపడ్డారు. ఈ పోటీలో అశ్విన్ సెహ్వాగ్ను ఎంచుకున్నాడు.
అదే సమయంలో సచిన్ గంగూలీని, కపిల్ దేవ్ రాహుల్ ద్రవిడ్ను, బుమ్రా విరాట్ కోహ్లీని అధిగమించి తదుపరి దశకు చేరారు.
సెమీస్లో బుమ్రాకు షాక్.. కపిల్ ఫైనల్కు..
సెమీఫైనల్స్లో సచిన్ టెండూల్కర్.. వీరేంద్ర సెహ్వాగ్ను అధిగమించాడు. మరో సెమీఫైనల్లో జస్ప్రీత్ బుమ్రాపై కపిల్ దేవ్ విజయం సాధించాడు.
కపిల్ ఎంపికకు కారణం కూడా అశ్విన్ వివరించాడు. 1983 ప్రపంచకప్ విజయంతో పాటు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ప్రభావం చూపిన కపిల్ దేవ్ ఆల్రౌండ్ సామర్థ్యం తనను ఆకట్టుకుందని చెప్పాడు.
ఫైనల్లో సచిన్ vs కపిల్..!
ఇక తుది పోరులో ఇద్దరు దిగ్గజాలు ఎదురెదురుగా నిలిచారు. ఒకవైపు 1983 ప్రపంచకప్ గెలిపించిన కపిల్ దేవ్.. మరోవైపు భారత బ్యాటింగ్కు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చిన సచిన్ టెండూల్కర్.
ఎవరిని ఎంచుకోవాలో నిర్ణయించే సమయంలో అశ్విన్ తన వ్యక్తిగత అభిమానం కూడా పరిగణనలోకి తీసుకున్నాడు. చివరికి “సచిన్ టెండూల్కర్” వైపే తన ఓటు అని స్పష్టం చేశాడు.
అశ్విన్ ఆల్టైమ్ గ్రేట్.. సచిన్!
దీంతో అశ్విన్ రూపొందించిన ఈ దిగ్గజాల బ్రాకెట్లో సచిన్ టెండూల్కర్ విజేతగా నిలిచాడు. అంటే అశ్విన్ దృష్టిలో అన్ని తరాల భారత పురుష క్రికెటర్లలో సచినే అత్యుత్తమ ఆటగాడు.
అంతర్జాతీయ క్రికెట్కు 2024 డిసెంబరులో వీడ్కోలు పలికిన అశ్విన్.. భారత్ తరఫున టెస్టుల్లో 537 వికెట్లు సాధించాడు. అన్ని ఫార్మాట్లు కలిపి 765 వికెట్లతో భారత అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో అనిల్ కుంబ్లే తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు.
అశ్విన్ ఎంపిక చేసిన తుది విజేత: సచిన్ టెండూల్కర్.!
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..