
Ganja Smuggling Busted: ఒడిశా నుంచి హైదరాబాద్కు కార్లో గంజాయిని ఇల్లీగల్గా సప్లై చేస్తున్న ఒక ఇంటర్స్టేట్ గ్యాంగ్ ఆటను తెలంగాణ ఈగల్ ఫోర్స్, స్టేట్ టాస్క్ ఫోర్స్ (STF), ఆర్ఎన్సీసీ ఖమ్మం టీమ్స్ చౌటుప్పల్ పోలీసులతో కలిసి కట్ చేశాయి. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ప్లాజా దగ్గర విజయవాడ–ముంబై నేషనల్ హైవేపై కార్ను ఆపి ఇద్దరు అక్యుజ్డ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ల దగ్గరి నుంచి రూ.10.25 లక్షల విలువైన 20.5 కేజీల గంజాయి, ట్రాన్స్పోర్ట్ కోసం వాడిన కార్, 3 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. అరెస్టయిన వారిని ఒడిశాకు చెందిన త్రిలోచన్ సమంత్ర (30), అతని నెవ్యూ సాగర్ బాల్ (23)గా ఐడెంటిఫై చేశారు.
18 గంటల ఆపరేషన్.. పంతంగి దగ్గర పక్కా ప్లాన్తో పట్టుకున్నారు
ఒడిశా నుంచి కార్లో గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నారనే పక్కా ఇన్ఫర్మేషన్తో ఆఫీసర్స్ దాదాపు 18 గంటల పాటు ఆ వెహికల్పై కంటిన్యూయస్గా వాచ్ పెట్టారు. విశాఖపట్నం, రాజమండ్రి రూట్ ద్వారా ఫుల్ స్పీడ్తో వస్తున్న కార్ను ఫాలో అయిన ఖమ్మం ఆర్ఎన్సీసీ టీమ్, ఎలాంటి యాక్సిడెంట్స్ జరగకుండా ఎస్టీఎఫ్, చౌటుప్పల్ పోలీసులకు అప్డేట్స్ ఇస్తూ కోఆర్డినేట్ చేసుకుంది. కార్ పంతంగి టోల్ప్లాజా క్రాస్ అయ్యాక స్పీడ్ తగ్గించగానే పోలీసులు చాకచక్యంగా కార్ను బ్లాక్ చేసి ఇద్దరినీ కస్టడీలోకి తీసుకున్నారు. హైదరాబాద్లోని గంజాయి రిసీవర్ చెప్పిన సూచనలతో ఒడిశాలో రూ.25 వేలకే ఈ గంజాయిని కొని ఇక్కడికి తీసుకొస్తున్నట్లు ఎంక్వైరీలో తేలింది.
ఓల్డ్ క్రిమినల్.. రిసీవర్, సప్లయర్ కోసం సెర్చ్ ఆపరేషన్
మెయిన్ అక్యుజ్డ్ త్రిలోచన్ సమంత్రపై ఒడిశాలో ఇప్పటికే దొంగతనాలు, రాబరీ, ఆర్మ్స్ యాక్ట్ కింద 7కి పైగా క్రిమినల్ కేసెస్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెట్వర్క్లో మెయిన్ రిసీవర్గా ఉన్న పర్సన్, అలానే ఒడిశా సప్లయర్ ప్రస్తుతం రన్నింగ్లో ఉండటంతో వాళ్ల కోసం స్పెషల్ టీమ్స్ గాలిస్తున్నాయి. ఈ ఇన్సిడెంట్పై చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేశారు.