
నేరడిగొండ, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలోని ఎమ్మార్వో, ఎంపీడీవో ఆఫీసులకు వివిధ పనుల కోసం వచ్చే ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆఫీసుల ఆవరణలో బాత్రూమ్లను నిర్మించినప్పటికీ వాటికి తాళాలు వేసి ఉంచుతున్నారు.
మండలంలోని మారుమూల గ్రామాల నుంచి ధ్రువీకరణ పత్రాలు, భూ సమస్యలు, ఇతర పనుల కోసం రైతులు, మహిళలు నిత్యం ఆఫీసులకు వస్తుంటారు. కానీ ఆఫీసుల్లో బాత్రూమ్లు అందుబాటులో లేకపోవడంతో మహిళలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఆఫీసర్లు స్పందించి నిరుపయోగంగా ఉన్న బాత్ రూమ్ లను ఉపయోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.