
సొంత కారణాలతోనే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి బయటకు వెళ్లారని వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైసీపీని వీడిన వారిపై తాము ఎప్పుడూ పెద్దగా విమర్శలు చేయలేదని.. 40 ఏళ్లుగా వైఎస్ జగన్ వెంట ఉన్న వ్యక్తి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. పార్టీ నుంచి వెళ్లిన వారి గురించి జగన్ ఎప్పుడూ నెగెటివ్గా మాట్లాడలేదని, జగన్ మతమార్పిడులను ప్రోత్సహించారని సాయిరెడ్డి అనడం దారుణం అని ఫైర్ అయ్యాడు. విజయసాయి రెడ్డి పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు అని సజ్జల చెప్పుకొచ్చారు.
‘కాంగ్రెస్ పార్టీతో ములాఖత్ అయిన టీడీపీ.. వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేసింది. జగన్ అన్ని వర్గాల మనసులు గెలుచుకుని అధికారాన్ని తీసుకువచ్చారు. ఐదేళ్లలో 15 ఏళ్ల స్థాయి అభివృద్ధి చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు జగన్పై మాటల దాడి ఆగలేదు. మనుషులు మారినా వాళ్ళ టార్గెట్ మాత్రం జగన్. చంద్రబాబు వాళ్ళ ముఠా రంగప్రవేశం చేయకుండా బయట వ్యక్తులను ప్రోత్సహిస్తారు. ఉభయతారకంలా పని గడిచి పోతుంది. ఇప్పటికీ రెస్పాండ్ కాకపోతే సాధారణ ప్రజలకు ఇది నిజమే ఏమో అనిపించే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు ఏ రోజు ప్రజల గురించి అవసరం లేదు. కొత్తగా పాత్రలోకి వచ్చింది విజయసాయిరెడ్డి. ఆయన వ్యక్తిగత కారణాల వల్ల సాయిరెడ్డి బయటకు వెళ్ళారు. ఇప్పుడు రాజకీయ పార్టీ పెడతా అంటున్నారు. జగన్ ఎక్కడికి వెళ్లినా వారి గురించి నెగెటివ్గా మాట్లాడలేదు, మేము మాట్లాడలేదు’ అని సజ్జల అన్నారు.
‘2024 ఎన్నికల్లో పెద్ద ఎదురుదెబ్బ పడ్డా నిలదొక్కుకున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం. సీఎం చంద్రబాబు చేస్తున్న తప్పుడు పనులు అడ్డుకోవటానికి కోర్టుకు వెళ్ళాం. 44 లక్షల ఓటర్లను లిస్ట్ నుంచి తీసేసారు. లేని ఓటర్లతో ఎన్నికలకు ఎలా వెళ్తారు. మాకు ఎన్నికలంటే భయం లేదు. ఎలక్షన్ కమిషన్ క్లియర్ చేసిన తర్వాత ఎన్నికలకు సిద్ధం. జగన్ మత మార్పిడులు చేయించారు అని సాయిరెడ్డి మాట్లాడటం కరెక్ట్ కాదు. మార్చాలి అనుకుంటే ఈయనను మార్చేవారు కదా. ఇతర మతాలు అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ కు గౌరవం. చంద్రబాబు అంటున్నారు అంటే అందరికీ తెలుసు.. జగన్ గురించి అన్నీ తెలిసి సాయిరెడ్డి ఎలా మాట్లాడుతారు. కేవలం అటెన్షన్ తన వైపు తిప్పుకోవడానికి ఇలా మాట్లాడుతున్నారు. ఆయనకు ఇలాంటి అవకాశం ఇవ్వకూడదు అని ఇప్పటివరకు మాట్లాడలేదు. ఇప్పటికీ రియాక్ట్ కావటం లేదు అని మళ్ళీ కొత్తగా ఇంకొక మెసేజ్ పెట్టారు. కోటరీ.. నంబర్ 1, నంబర్ 2 అంటూ బహిరంగ లేఖ రాశారు. మొత్తం నా గురించే పెట్టారు. క్రియాశీలకంగా ఉన్న వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేస్తే పార్టీలో రాంగ్ ఇండికేషన్ పోతుంది అని మాట్లాడాల్సి వస్తుంది. నేను పదవుల గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు.. పదవులు అంటే బాధ్యతగా భావించా. ఆయన కామెంట్స్ మీద అపోహలు వచ్చే అవకాశం ఉందని భావించే మాట్లాడుతున్నా. వైసీపీ ఆవిర్భావం నుంచి కర్త, కర్మ జగన్. తన తండ్రి ఆలోచనలు.. తన ఆలోచనల నుంచి వైసీపీ పుట్టింది. అడ్మినిస్ట్రేషన్ విత్ హ్యూమన్ టచ్. సమాజం అభివృద్ధి చెందటానికి అడుగులు వేశారు’ అని సజ్జల క్లారిటీ ఇచ్చారు.