Reading Time: < 1 minute

నాంపల్లి కోర్టుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఈ కార్ రేసింగ్ కేసు విచారణ

Caption of Image.

మాజీ మంత్రి.. బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ నాంపల్లి  ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో హెచ్​ఎండీఏ నిధులు రూ. 55 కోట్లు ఫార్ములా  ఈ కార్​ రేసింగ్​కు కేబినెట్​ ఆమోదం లేకుండా విదేశీ సంస్థకు  మళ్లించారని ఆరోపణలు ఉన్నాయి. 

ఫార్ములా ఈ-రేసు నిర్వహణలో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని ఆరోపిస్తూ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో కేటీఆర్‌ను ఏ1గా పేర్కొంటూ 77 పేజీల ఛార్జ్‌షీట్‌ను మార్చి 23న దాఖలు చేసింది. ఈ ఛార్జ్‌షీట్‌లో మొత్తం 14 మంది సాక్షులను ఏసీబీ ప్రస్తావించింది.

 కోర్టు ఈ ఛార్జీషీట్‌ను పరిగణనలోకి తీసుకుని, నిందితులకు సమన్లు జారీ చేసింది. కేటీఆర్ ఈ విచారణలో పాల్గొనడం ద్వారా తనపై ఉన్న ఆరోపణలకు సమాధానం ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఈ విచారణ నేపథ్యంలో నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశారు. కోర్టు పరిసరాల్లో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడటానికి చర్యలు తీసుకున్నారు. 

©️ VIL Media Pvt Ltd.