July 23, 2026

దేశంలో భారీగా తగ్గిన గోల్డ్ స్మగ్లింగ్.. వెండి అక్రమ రవాణాపై పడ్డ స్మగ్లర్లు !

దేశంలో భారీగా తగ్గిన గోల్డ్ స్మగ్లింగ్.. వెండి అక్రమ రవాణాపై పడ్డ స్మగ్లర్లు !
Reading Time: 2 minutes

దేశంలో భారీగా తగ్గిన గోల్డ్ స్మగ్లింగ్.. వెండి అక్రమ రవాణాపై పడ్డ స్మగ్లర్లు !

Caption of Image.
  • 2025 నాటికి 646 కిలోలకు తగ్గిన స్మగ్లింగ్
  • వెండి అక్రమ రవాణాపై పడ్డ స్మగ్లర్లు
  • నిరుడు మొత్తం 542 కిలోల సిల్వర్​ స్మగ్లింగ్​.. ఈ ఏడాది 3 నెలల్లోనే 586 కిలోలు 
  • పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వెల్లడించిన కేంద్రం

హైదరాబాద్, వెలుగు: సూట్​కేస్​ ట్రాలీ రాడ్​లో బంగారం.. నీళ్ల సీసాల్లో బంగారం.. ఒక్కటేంటి బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు ముఠాలు పన్నిన ఎత్తుగడలు అన్నీఇన్నీ కాదు. కానీ, ఇప్పుడు దేశంలో ఆ గోల్డ్​ స్మగ్లింగ్​ భారీగా తగ్గిపోయింది. మూడేండ్లలో దాదాపు 8 రెట్లు పడిపోయింది. ఈ విషయాన్ని పార్లమెంట్​లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

2023–24 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 4971.68 కిలోల బంగారాన్ని ముఠాలు అక్రమంగా రవాణా చేశాయి. అంటే దాదాపు 5 టన్నుల గోల్డ్​స్మగ్లింగ్​జరిగింది. 6599 కేసులు నమోదైతే.. 2003 మందిని కస్టమ్స్​అధికారులు అరెస్ట్​ చేశారు. అదే సమయంలో 2025 నాటికి గోల్డ్​ స్మగ్లింగ్​ 646.66 కిలోలకు (6.5 క్వింటాళ్లు) తగ్గిపోయింది.

ఆ ఏడాది 836 కేసులు నమోదుకాగా.. 508 మందిని అరెస్ట్​ చేశారు. అయితే, 2022–23 ఆర్థిక సంవత్సరంలో 4.3 టన్నుల బంగారాన్ని అక్రమ రవాణా చేయగా.. 2023లో పెరగడం గమనార్హం. 2022లో 4619 కేసులు నమోదు చేస్తే.. 1740 మందిని అరెస్ట్​ చేశారు. 2024–25లో 2.6 టన్నుల బంగారం అక్రమ రవాణా జరగ్గా.. 3005 కేసులు నమోదై 1240 మందిని అరెస్ట్​ చేశారు. కాగా, ఈ ఏడాది జూన్​ వరకు మొత్తంగా 247 కిలోల బంగారాన్ని స్మగ్లింగ్​ చేయగా.. కస్టమ్స్​ అధికారులు 452 కేసులు నమోదు చేసి 183 మందిని అరెస్ట్​ చేశారు.

వెండివైపు చూపు..
ఇటు వెండి అక్రమ రవాణా కూడా గతంతో పోలిస్తే 2025లో తగ్గినా.. ఈ ఏడాది ఇప్పటివరకు మాత్రం ఎక్కువైంది. 2022లో 784 కిలోల వెండి స్మగ్లింగ్​ జరగ్గా 64 కేసులు నమోదయ్యాయి. ఆ కేసులో  కేవలం ఒక్కరినే అరెస్ట్​ చేశారు. 2023లో 984 కిలోల స్మగ్లింగ్​జరగ్గా.. 50 కేసులు నమోదయ్యాయి. ఒక్కరిని అరెస్ట్​ చేశారు. 2024లో వెండి స్మగ్లింగ్ భారీగా పెరిగింది. 2,505 కిలోల వెండిని అక్రమంగా తరలించగా.. కస్టమ్స్​ అధికారులు 47 కేసులు నమోదు చేశారు. నలుగురిని అరెస్ట్​ చేశారు.

2025లో మాత్రం స్మగ్లింగ్ ​చేసిన వెండి 542 కిలోలకు తగ్గగా.. 44 కేసులు పెట్టారు. ముగ్గురిని అరెస్ట్​ చేశారు. ఈ ఏడాది జూన్​వరకే 586 కిలోల వెండి స్మగ్లింగ్​ జరిగింది. వాస్తవానికి గత ఆరు నెలల్లో బంగారం ధరలు భారీగా పెరగడంతో చాలా మంది వెండివైపు చూస్తున్నారు. వ్యాపారులూ అడ్డదారుల్లో వెండిని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఏడాది 23 కేసులు నమోదుచేయగా.. 10 మందిని అరెస్ట్​ చేశారు.

©️ VIL Media Pvt Ltd.