
రూ. 2 వేలు లంచం డిమాండ్ చేసిన టికెట్ ఇన్ స్పెక్టర్ పై కండక్టర్ చెప్పుతో దాడి చేసిన ఘటనలో ట్విస్ట్ చోటుచేసుకుంది. తాను లంచం డిమాండ్ చేయలేదని ఆర్టీసీ టికెట్ ఇన్ స్పెక్టర్ ప్రకాష్ చెప్పుకొచ్చారు. కండక్టర్ వసంత్ పురుష ప్రయాణికుడి నుంచి డబ్బులు తీసుకుని మహిళలకు ఇచ్చే మహాలక్ష్మి టికెట్ ఇచ్చారని ప్రకాష్ ఆరోపించారు. ఈ విషయంపై మెమో జారీ చేస్తామని చెప్పడంతో తాను లంచం డిమాండ్ చేసినట్టు ప్రచారం చేశాడని టికెట్ ఇన్ స్పెక్టర్ చెప్పారు. ప్రయాణికులను రెచ్చగొట్టి తనపై దాడి చేయించాడాని కండక్టర్ వసంత్ పై రాయికోడ్ పోలీస్ స్టేషన్ లో టికెట్ ఇన్ స్పెక్టర్ ఫిర్యాదు చేశారు. గతంలోనూ కండక్టర్ వసంత్ పై పలు అవినీతి ఆరోపణలు ఉన్నట్టు టికెట్ ఇన్ స్పెక్టర్ ప్రకాష్ ఆరోపించారు.