
కరీంనగర్ సిటీ, వెలుగు: టెన్త్ ఫలితాలలో నగరంలోని జాన్సన్ కోరా పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. 600 మార్కులకు గాను 587, 581, 580, 570, 577, 575 మార్కులతో పాటు వంద శాతం ఉతీర్ణత సాధించారు. పాఠశాల చైర్మన్ మహిపాల్ రెడ్డి, డైరెక్టర్లు వరప్రసాద్, రాంరెడ్డి, సింహాచలం హరికృష్ణ, వంగల సంతోష్రెడ్డి విద్యార్థులకు బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.