
Kerala Elections Exit poll 2026: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికలు నేటితో పూర్తయ్యాయి. ఈ ఎన్నికల్లో రికార్డ్ స్థాయి ఓటింగ్ నమోదైంది. అస్సాం, కేరళం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదచ్చేరిలో ఎవరు గెలుస్తారా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే 04న తుది ఫలితాలు రాబోతున్నాయి.
అస్సాం, కేరళ, పుదుచ్చేరిలలో ఏప్రిల్ 9న పోలింగ్ జరగ్గా, తమిళనాడులో కూడా ఏప్రిల్ 23న ఒకే దశలో పోలింగ్ నిర్వహించారు. బెంగాల్లో రెండు దశల్లో మొదటి దశ ఏప్రిల్ 23న జరిగింది. రెండో దశ బుధవారం(ఏప్రిల్29)న జరిగింది. వెస్ట్ బెంగాల్లో 294, అస్సాంలో 126, తమిళనాడులో 234, కేరళలో 140, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి.
కేరళలో ఈసారి హస్తం హవా వీస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. వామపక్ష ఎల్డీఎఫ్ కూటమికి అధికారం దూరం కానుంది. గత రెండు పర్యాయాలుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ కూటమి ఈ సారి కేరళలో అధికారం చేపట్టబోతోంది.
