Reading Time: < 1 minute
Kolkata Counting Centres Ban Gatherings Evm Row Tmc Protest

West Bengal elections: పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి ఆ రాష్ట్రంలో హైడ్రామా మొదలైంది. అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో, తాము 220పైగా స్థానాల్లో విజయం సాధిస్తామని సీఎం మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేసింది. ఒక వైపు తన గెలుపుపై విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూనే, ఈవీఎంలపై నిఘా వేసి ఉంచాలని తన కార్యకర్తల్ని కోరింది.

Read Also: Nara Rohit: తండ్రి కాబోతున్న నారా హీరో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోషూట్

గురువారం రాత్రి కోల్‌కతాలోని రెండు కౌంటింగ్ కేంద్రాల వద్ద టీఎంసీ హైడ్రామాకు తెర తీసింది. స్ట్రాంగ్‌రూంలో కొందరు వ్యక్తులు ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతూ టీఎంసీ నేతలు ఆందోళన చేశారు. అర్థరాత్రి కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న మమతా బెనర్జీ ఆందోళనలో పాల్గొన్నారు. బీజేపీ కేంద్ర బలగాల సహాయంతో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయాలని చూస్తుందని ఆమె అన్నారు. అయితే, ఈ ఆరోపణల్ని బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ అగర్వాల్ తోసిపుచ్చారు.

ఇదిలా ఉంటే, బెంగాల్ పోలీసుల కీలక చర్యలు తీసుకుంటుున్నారు. షహీద్ క్షుదీరామ్ బోస్ రోడ్, జడ్జెస్ కోర్ట్ రోడ్, జాదవ్‌పూర్, డైమండ్ హార్బర్ రోడ్, లార్డ్ సిన్హా హాల్, నరేష్ మిత్రా సరాని (బెల్తలా రోడ్) మరియు ప్రమతేష్ బారువా సరాని ప్రాంతాల్లో పోలీసులు నిషేధాజ్ఞలు జారీ చేశారు. అంతకుముందు, గురువారం రాత్రి కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలోని ఒక కౌంటింగ్ కేంద్రం వెలుపల బీజేపీ, తృణమూల్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.