Reading Time: < 1 minute
Adivi Sesh Reply To Trolls On Fan Base Goodachari 2 Interview

Adivi Sesh: టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో అడివి శేష్. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తన అభిమానుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోల్స్‌కు ఆయన తనదైన శైలిలో కౌంటర్ ఇస్తూనే, ఒక నటుడికి ఉండాల్సిన అసలైన ఫ్యాన్ బేస్ అంటే ఏంటో వివరించారు. “నీకు కూడా ఫ్యాన్స్ ఉన్నారా?” అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న రివర్స్ ట్రోలింగ్‌పై శేష్ స్పందించారు.

ఈ సందర్భంగా ఆయన ఒక సంఘటనను గుర్తు చేశారు.. ” గూఢచారి 2 గురించి ఒక ట్వీట్ వేస్తూ థాంక్యూ టూ ఫ్యాన్స్ అని ఏదో వేశాను. నేను పొరపాటున కూడా రిప్లైలను చదవను. కానీ దానికి చదివితే ఈ పోస్ట్‌కు ఒకరు నీ కూడా ఫ్యాన్స్ ఆ అని కామెంట్ వేశారు. అయితే నా ఉద్దేశ్యం ఏంటంటే.. ఈ ఫ్రాంచైజీకి ఫ్యాన్స్ ఉన్నారని నా ఉద్దేశ్యం. కానీ ఎక్కడో కాలింది.. నన్ను నమ్మి థియేటర్లకు వచ్చేవాళ్లు ఉన్నారు.. నన్ను అమితంగా ప్రేమించేవాళ్లు ఉన్నారు. మరి వాళ్లని ఫ్యాన్స్ అనకూడదా?” అని ప్రశ్నించారు. కేవలం ఈలలు వేసి, గోల చేసేవారే కాకుండా, సినిమాలోని కంటెంట్‌ను ఇష్టపడి తనను ప్రోత్సహించే ప్రతి ఒక్కరూ తన అభిమానులేనని ఆయన స్పష్టం చేశారు. తనపై వచ్చే విమర్శలను, ట్రోల్స్‌ను ఆయన ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదన్నారు. ‘మేజర్’, ‘హిట్-2’ వంటి చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న శేష్, తన సినిమాలకు వస్తున్న వసూళ్లే తన అభిమానుల బలానికి నిదర్శనమని పరోక్షంగా గుర్తు చేశారు. ఇండస్ట్రీలో ఒకప్పుడు కేవలం స్టార్ పవర్ ఉంటేనే ఫ్యాన్స్ ఉండేవారు. కానీ అడివి శేష్ వ్యాఖ్యలతో ‘కంటెంట్ నమ్ముకున్న నటులకు’ కూడా బలమైన ఫ్యాన్ బేస్ ఉంటుందని మరోసారి రుజువు అయ్యింది.