
మహారాష్ట్రలో విషాదకర ఘటన వెలుగుచూసింది. విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చనిపోయారు. సిబ్బందితో సహా మొత్తం ఐదుగురు ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు డీజీసీఏ ధ్రువీకరించింది. కూలిపోయిన విమానంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్తో పాటు ఆయన పీఏ, సెక్యూరిటీ సిబ్బంది ఒకరు, పైలట్, కో పైలట్ ఉన్నట్లు తెలిపింది. విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో.. సాంకేతిక లోపంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఉదయం 8.46 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. తాజాగా విమానం కూలిపోతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కూలిపోయిన సమయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం వీడియోలో చూడవచ్చు.