Reading Time: 2 minutes
Video: వామ్మో.. ఇదేం ప్రతీకారం వరుణ్ భయ్యా.. రియాన్ పరాగ్ వికెట్ తీసి ఇలా చేశావేంటి..?

Varun Chakaravarthy vs Riyan Parag: ఈ సీజన్ ఆరంభంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన వరుణ్ చక్రవర్తి, రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో మాత్రం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆరంభంలోనే వైభవ్ సూర్యవంశీ వికెట్ తీసి కోల్‌కతాకు తొలి విజయాన్ని అందించాడు. అద్భుతంగా ఆడుతున్న సూర్యవంశీ కేవలం 4 పరుగుల తేడాతో అర్ధ సెంచరీని చేజార్చుకున్నాడు. ఆ తర్వాత కూడా తన స్పిన్ మాయాజాలాన్ని కొనసాగించిన వరుణ్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్ వంటి కీలక ఆటగాళ్లను పెవిలియన్‌కు పంపాడు. నిర్ణీత నాలుగు ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టును కోలుకోలేని దెబ్బ తీశాడు.

రియాన్ పరాగ్ వికెట్ వెనుక అసలు కథ..

మైదానంలో ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే వరుణ్ చక్రవర్తి, రియాన్ పరాగ్ వికెట్ తీసిన తర్వాత ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చాడు. దీనికి ప్రధాన కారణం అంతకుముందు బంతికే పరాగ్ ఒక రివర్స్ స్కూప్ షాట్ ద్వారా ఫోర్ కొట్టాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్ నాలుగో బంతికి వరుణ్ ఒక అద్భుతమైన డెలివరీతో పరాగ్ వికెట్లను గిరాటేశాడు. బంతి స్టంప్స్‌ను తాకగానే వరుణ్ గాలిలో ఎగురుతూ సంబరాలు చేసుకున్నాడు. పరాగ్ మైదానాన్ని వీడుతున్న సమయంలో అతని ముఖం వైపు చూస్తూ ఏదో అన్నట్లు కెమెరాలో స్పష్టంగా కనిపించింది. పరాగ్ ఆ వ్యాఖ్యలను పట్టించుకోకుండా నిరాశగా వెనుదిరిగాడు.

కెప్టెన్‌గా రాణిస్తున్నా.. బ్యాటర్‌గా విఫలం..

రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఈ ఏడాది నూతన కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రియాన్ పరాగ్, జట్టును పట్టికలో మూడవ స్థానంలో నిలిపాడు. అయితే వ్యక్తిగత ప్రదర్శన విషయానికి వస్తే పరాగ్ ఘోరంగా విఫలమవుతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన ఆరు ఇన్నింగ్స్‌ల్లో కలిపి అతను కేవలం 60 పరుగులు మాత్రమే చేశాడు. దీనిపై అభిమానులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాడు. బ్యాటింగ్‌పై దృష్టి సారించేందుకు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని కూడా కొందరు సూచిస్తున్నాడు.

కోల్‌కతా క్లిష్ట పరిస్థితి..

ఈ మ్యాచ్‌లో బౌలర్లు రాణించినప్పటికీ, టోర్నమెంట్‌లో కోల్‌కతా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అజింక్యా రహానే నాయకత్వంలోని ఈ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఆడిన మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక పాయింట్ సాధించిన ఈ జట్టుకు రానున్న మ్యాచ్‌లు అత్యంత కీలకం కానున్నాయి. తాజా మ్యాచ్‌లో రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 154 పరుగులు చేయగా, వరుణ్ స్పెల్ మ్యాచ్ ఫలితాన్ని శాసించేలా ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..