
77వ రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ఎంపీ రాహుల్గాంధీకి సీటు కేటాయింపుపై మరోసారి వివాదం తలెత్తింది. ప్రోటోకాల్ మరిచి ప్రతిపక్షనేతకు మూడో వరుసలో సీటు కేటాయించారని కాంగ్రెస్ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రతిపక్ష హోదాలో ఉన్న వ్యక్తికి చిన్న పిల్లల మధ్య సీటు కేటాయించడం ప్రోటోకాల్ వివాదమే కాదు.. భద్రతకు సంబంధించిన నిర్లక్ష్యమని సోషల్ మీడియాలో కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత దేశం ఎప్పటికీ మర్చిపోదు.. ఎప్పటికీ క్షమించదు అంటూ ట్వీట్లు చేశాయి కాంగ్రెస్ వర్గాలు.
2024: On Independence Day, the LoP Rahul Gandhi was made to sit in the second-last row.
2026: Republic Day now the last row. Even children seated ahead.
This isn’t protocol. This is petty insecurity. His Popularity unsettles some.
India Will Never Forget And Never Forgive ⏳… pic.twitter.com/g7zLUYOww7
— India With Congress (@UWCforYouth) January 26, 2026
రాహుల్గాంధీకి ప్రోటోకాల్ ఉల్లంఘన ద్వారా అవమానం కొత్తేమికాదు.. గత 2024 స్వాతంత్రవేడుకల్లో కూడా సీటు కేటాయింపులో ప్రొటోకాల్ఉల్లంఘించారని కాంగ్రెస్ మండిపడుతోంది. అప్పడు రెండో వరుస చివర్లో సీటు కేటాయించారు.. ఇప్పుడు మూడో వరుసలో పిల్లల మధ్య సీటు ఇవ్వడంతో కాంగ్రెస్ వర్గాలు భగ్గుమన్నాయి. ప్రొటోకాల్ ఉల్లంఘనే కాదు భద్రతకు సంబంధించిన నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తే సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో పోస్టులు షేర్ చేశారు.
►ALSO READ | ఫేక్ వెహికల్ పాస్ వాడినందుకు..కచ్చా బాదం ఫేమ్ అంజలి అరోరా ప్రియుడు అరెస్టు
77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం (జనవరి26) దేశమంతా పండుగలా జరుపుకుంది. పిల్లలు, పెద్దలు అంతా ఎంతో ఉత్సాహంగా రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకున్నారు. దేశ రాజధానిఢిల్లీలో ఘనంగా రిపబ్లిక్ వేడుకలు జరిగాయి. ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో ఈ వేడుకలు నిర్వహించారు. ఆర్మీ, నావికాదళం, వైమానికదళం, సాంస్కృతిక శకటాలు, వివిధ ప్రదర్శనలతో కూడి గ్రాండ్ కవాతుతో వేడుకలు విజయవంతంగాజరిగాయి. ఈ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ప్రధాని మోదీ, ప్రతిపక్ష పార్టీ నేతలు పాల్గొన్నారు.