
ముప్పై వేల మంది అతిథుల కోసం వెయ్యి మంది వంటవాళ్లు దేశీ, విదేశీ వంటకాలను సిద్ధం చేశారు. రాయ్సెన్లో ఇంత పెద్ద వేడుక ఎప్పుడూ జరగలేదని స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కుమారుడి వివాహ వేడుక కొద్దిరోజుల క్రితం చాలా నిరాడంబరంగా జరిగింది. ముఖ్యమంత్రి చిన్న కుమారుడు డాక్టర్ అభిమన్యు తన చిరకాల స్నేహితురాలు డాక్టర్ ఇషితా పటేల్ను ఉజ్జయినిలో వివాహం చేసుకున్నారు. బాబా రామ్దేవ్ మంత్రాలు చదువుతుండగా పూలదండలు మార్చుకుని నిరాడంబరంగా వివాహ తంతును ముగించారు.
మరిన్ని వీడియోల కోసం :