Reading Time: < 1 minute
Man Cuts Off Mother In Laws Nose In Rajasthans Jalore Flees With It

రాజస్థాన్‌లోని జలోర్ జిల్లాలో చాలా కాలంగా కుటుంబ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో.. శనివారం ఒక వ్యక్తి తన అత్తగారి ముక్కును కత్తెరతో కోసేశాడు. అంతటితో ఆగకుండాజజ ఆ కోసిన ముక్కు ముక్కను తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో సర్వానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు కైలీ దేవి (52) తన అల్లుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తుండగా.. దారిలోనే అల్లుడు సోహన్‌లాల్ ఆమెపై దాడి చేశాడు.

Also Read:Bamruk-ud-Daula lake: హైదరాబాద్‌లో ప్రారంభానికి సిద్ధంగా మరో చెరువు.. సంతోషంలో స్థానికులు..

ఆరేళ్ల క్రితం సోహన్‌లాల్‌కు.. కైలీ దేవి కుమార్తె సరితతో పెళ్లయింది. వీరికి గతేడాది కాలంగా గొడవలు జరుగుతున్నాయి. దాంతో సరిత తన భర్తకు దూరంగా పుట్టింటిలోనే ఉంటోంది. ఈ గొడవను పరిష్కరించేందుకు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు పెట్టినా, ఏమీ తేలలేదు.

తన సంసారంలో గొడవలకు అత్తగారే కారణమని, ఆమె తన భార్యను తనకి వ్యతిరేకంగా మారుస్తోందని సోహన్‌లాల్ అనుమానించేవాడు. ఇదే విషయమై శనివారం మధ్యాహ్నం 2 గంటలకే వారి ఇంట్లో గొడవ జరిగింది. ఆ వేధింపులు భరించలేక.. అత్త కైలీ దేవి పోలీసులకు ఫిర్యాదు చేయాలని బయలుదేరింది. ఆ సమయంలోనే అల్లుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు.

Also Read:Marriage: ఆడబిడ్డకు అండగా ‘వైద్యుల’ బృందం.. సోషల్ మీడియా పరిచయం పెళ్లి బంధమైన వేళ..

గాయపడిన కైలీ దేవిని ముందుగా సాంచోర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఆమెను గుజరాత్‌లోని మెహసానా ఆసుపత్రికి తరలించారు. నిందితుడు సోహన్‌లాల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు చేపట్టారు.