
స్విగ్గీ స్పీడ్ డెలివరీ కొనుగోళ్లలో విజయవాడ దూసుకుపోయింది. విజయవాడ ప్రజల్లో వస్తున్న ఆర్థిక మార్పులకు, జీవనశైలికి ఈ కొనుగోళ్లు అద్దం పడుతున్నాయని స్విగ్గీ రిపోర్ట్ వివరించింది. 2025లో విజయవాడలో ఒక వ్యక్తి రూ. 3.62 లక్షలకు సరుకులు ఆర్డర్ పెట్టారట. ప్రతి రోజు ఏడాది పొడవునా అంత ఖర్చు చేశారట. హైదరాబాద్లో ఒక వినియోగదారుడు ఏడాదిలో రూ. 4.3 లక్షలు కొనడం దేశంలోనే అత్యధికంగా నిలిచింది. అయితే ఆ వినియోగదారుడు మూడు ఐ ఫోన్లను కొనడంతో అంత ఖర్చు అయింది. విజయవాడలో మరో ముగ్గురు కొనుగోలుదారులు ఏడాదిలో రూ. 3 లక్షలకుపైగా కొనుగోలు చేశారని ఇన్స్టామార్ట్ తెలిపింది.
మరిన్ని వీడియోల కోసం :