July 23, 2026

Students Protest : ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్ ఘటనపై సల్మాన్ ఖాన్ ట్వీట్ వైరల్

Students Protest : ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్ ఘటనపై సల్మాన్ ఖాన్ ట్వీట్ వైరల్
Reading Time: 2 minutes
Salman Khan Reacts To Delhi Police Lathicharge On Students Over Paper Leak

పేపర్ లీకేజీలు రద్దు చేసి, పారదర్శకమైన విద్యావ్యవస్థను అందించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎంతగానో శాంతియుతంగా సాగుతున్న ఈ ఉద్యమం అనుకోకుండా హింసాత్మక మలుపు తిరగడంపై పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో గాయపడిన విద్యార్థులకు, వారి కుటుంబాలకు సమాజం నుంచి పెద్ద ఎత్తున సానుభూతి వ్యక్తమవుతోంది.

తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఈ వ్యహారంపై స్పందిస్తూ ‘ పేపర్ లీక్ అనేది విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే అత్యంత తీవ్రమైన అంశం. దేశంలోని యువత అంతా కలిసికట్టుగా మెరుగైన విద్యావ్యవస్థ కోసం గళం విప్పడం, వారికి తల్లిదండ్రులు సైతం అండగా నిలవడం గొప్ప పరిణామం. చదువుపై ఎంతో అంకితభావం, నిజాయితీ, భవిష్యత్తుపై స్పష్టమైన లక్ష్యంతో ఉన్న ఈ తరం యువత చూపిస్తున్న చొరవ అభినందనీయం. శాంతియుత మార్గంలో నిరసనలు తెలుపుతూ తమ హక్కుల కోసం పోరాడుతున్న ఈ ధైర్యవంతులైన విద్యార్థులే రేపటి భారతదేశానికి గర్వకారణంగా మారనున్నారు.

ఈ సమస్య కేవలం విద్యార్థులకు, విద్యావ్యవస్థకు మధ్య ఉన్నది మాత్రమే. ఈ ఉద్యమ క్రెడిట్ అంతా విద్యార్థులకే చెందుతుంది తప్ప, దీనిని ఏ రాజకీయ పార్టీలు కూడా తమ ప్రయోజనాల కోసం స్వార్థంతో వాడుకోకూడదు. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి విద్యార్థుల ఆందోళనను అర్థం చేసుకోవాలి. విద్యావ్యవస్థలోని లోపాలను సరిదిద్ది, వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయడం ద్వారా ఇటు విద్యార్థులకు, అటు దేశానికి ఎంతగానో మేలు జరుగుతుంది.

ఈ క్రమంలో చదువుకు సమాజంలో అత్యంత ప్రాధాన్యత పెరగాలి. ఏటా చదువు అనేది ఒక ట్రెండ్‌గా, గర్వకారణమైన అంశంగా మారాలి. ఎంతలా అంటే, విదేశాల నుంచి కూడా విద్యార్థులు మన దేశానికి వచ్చి చదువుకునే స్థాయికి భారతదేశం ఒక అంతర్జాతీయ ‘ఎడ్యుకేషనల్ హబ్’గా రూపాంతరం చెందాలి. ఉన్నతమైన ఆశయంతో చదువుకోవాలనుకునే ప్రతీ ఒక్కరికీ సముచిత గౌరవం, సరైన అవకాశాలు దక్కాలని ఆశిద్దాం’ అని ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసారు.