July 23, 2026

పార్లమెంట్లో అదే లొల్లి.. మూడో రోజూ సభలో ఉద్రిక్త వాతావరణం

పార్లమెంట్లో అదే లొల్లి.. మూడో రోజూ సభలో ఉద్రిక్త వాతావరణం
Reading Time: 2 minutes

పార్లమెంట్లో అదే లొల్లి.. మూడో రోజూ సభలో ఉద్రిక్త వాతావరణం

Caption of Image.
  • నల్ల దుస్తులతో పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. గేటు వద్ద విపక్షాల నిరసన

న్యూఢిల్లీ: నీట్-పేపర్ లీక్ అంశంపై పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వరుసగా మూడో రోజు బుధవారం కూడా తీవ్ర గందరగోళం నెలకొంది. నీట్ అంశంతో పాటు శాంతియుతంగా ఆందోళన చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) కార్యకర్తలపై లాఠీచార్జ్ పై వెంటనే చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. సమావేశాల మొదటి రోజు నుంచే నీట్ అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

ప్రతిపక్షాల వల్లే చర్చ ఆలస్యమవుతోందని, ఫ్లోర్ లీడర్లతో మాట్లాడిన తర్వాత చర్చ సమయాన్ని నిర్ణయిస్తామని చెప్పారు. అయితే. కాంగ్రెస్ నేత వేణుగోపాల్ జోక్యం చేసుకుని.. కేవలం చర్చ మాత్రమే కాకుండా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ వ్యవహారంపై ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ చర్చను కోరుకుంటున్నాయి కాబట్టి టైం ఖరారు చేసుకోవాలని స్పీకర్ ఓం బిర్లా సూచించారు.

మాకు మాట్లాడే అవకాశం ఇవ్వరా..
లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభలో మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వకపోవడంపై సమాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దాంతో ఆయన స్పీకర్ ఓం బిర్లా కేవలం కాంగ్రెస్ నేత కె.సి. వేణుగోపాల్, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజులు మాత్రమే మాట్లాడేందుకు అనుమతిస్తున్నారని మండిపడ్డారు. తన హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్లు తీసివేసి సభ నుంచి బయటకు వెళ్లబోయారు. స్పీకర్ జోక్యం చేసుకుని అఖిలేశ్  మాట్లాడాలని కోరారు.

ఈ సందర్భంగా అఖిలేశ్ మాట్లాడుతూ..”ప్రభుత్వం, కాంగ్రెస్ ఏమైనా సీక్రేట్ ఒప్పందం కుదుర్చుకున్నాయా? నీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీక్, యువత నిరసన అనేది ఏదో ఒక పార్టీకి చెందిన సమస్య కాదు. ఇది దేశంలోని లక్షలాది మంది స్టూడెంట్లు, యువత భవిష్యత్తుకు సంబంధించిన విషయం” అని ఫైర్ అయ్యారు.

ఢిల్లీలో విద్యార్థుల నిరసనపై పోలీసుల దాడిని అఖిలేశ్ ఖండించారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేసి తీవ్రంగా గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వం, పోలీసులు ఆందోళనలో పాల్గొన్న విద్యార్థుల ఎముకలు విరిచారు. మహిళా విద్యార్థుల దుస్తులు చింపేశారు.

విద్యార్థులతో ప్రవర్తించే తీరు ఇదేనా? మా కూతుళ్ల బట్టలు చింపుతారా?’ అని మండిపడ్డారు. విద్యార్థులపై ఇంత దారుణం జరుగుతున్నా ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎందుకు నోరు విప్పడంలేదని ప్రశ్నించారు. పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాట్లాడే అవకాశం లేకపోవడం వల్లే తాము రాహుల్ గాంధీతో కలిసి ప్రధాని ఇంటి వద్ద నిరసన చేయాల్సి వచ్చిందన్నారు.

©️ VIL Media Pvt Ltd.