Reading Time: < 1 minute
IND vs ENG: సెంచరీతో దుమ్మురేపిన వైభవ్.. ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్

England U19 vs India U19, Final, ICC Under 19 World Cup 2026: అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతోంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో భారత జట్టు 9 వికెట్లకు 411 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లండ్ జట్టు ముందు 412 పరుగుల టార్గెట్ నిలిచింది.

వైభవ్ సూర్యవంశీ 80 బంతుల్లో 175 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అతను 218.75 స్ట్రైక్ రేట్‌తో 15 ఫోర్లు, 15 సిక్సర్లు బాదాడు. సెబాస్టియన్ మోర్గాన్ అభిజ్ఞాన్ కుండు (40 పరుగులు), ఆ తర్వాత ఖిలాన్ పటేల్ (3 పరుగులు)లను అవుట్ చేశాడు. జేమ్స్ మీటో ఆర్.ఎస్. అంబ్రిస్ (18 పరుగులు), వేదాంత్ త్రివేది (32 పరుగులు), విహాన్ మల్హోత్రా (30 పరుగులు)లను అవుట్ చేశాడు. అలెక్స్ గ్రీన్ ఆయుష్ మాత్రే (53 పరుగులు), ఆరోన్ జార్జ్ (9 పరుగులు) వికెట్లు పడగొట్టాడు.

ఇరు జట్లు: