
లక్నో: టీమిండియా స్టార్ క్రికెటర్ రింకు సింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. హిందూ దేవతలను అవమానించేలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడంటూ అతడిపై కర్ణి సేన పోలీసులకు ఫిర్యాదు చేసింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన రింకు సింగ్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటామని సస్ని గేట్ పోలీసులు తెలిపారు.
వివాదం ఏంటంటే..?
ఇండియా, న్యూజిలాండ్ టీ20 సిరీస్కు ముందు రింకు సింగ్ తన సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ పోశాడు. ఏఐతో రూపొందించిన ఈ వీడియోలో హనుమంతుడు, శివుడు, వినాయకుడు వంటి హిందూ దేవుళ్లు సన్ గ్లాసెస్ ధరించి కారులో వెళ్తుంటారు. హనుమంతుడు కార్ డ్రైవ్ చేస్తుండగా శివుడు, వినాయకుడు కారులో ఇంగ్లీష్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
Also Read : స్టార్క్ రిటైర్మెంట్.. కమ్మిన్స్కు గాయం
ఈ వీడియోపై కర్ణి సేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హిందూ దేవతలను సన్ గ్లాసెస్ ధరించి వాహనం నడుపుతున్నట్లు చిత్రీకరించి అగౌరవపర్చారని మండిపడ్డారు. రింకు పోస్ట్ హిందువుల మనోభావాలను దెబ్బ తీసిందని..మత విశ్వాసాలను అవమానించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు రింకు సింగ్పై చర్యలు తీసుకోవాలని కర్ణి సేన నేత సుమీత్ తోమర్ సస్ని గేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరీ రింకుపై పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలీ.
#BREAKING – Karni Sena filed a case against cricketer #RinkuSingh in Aligarh, accusing him of having a Jihadi mindset.
Rinku Singh had shared an AI video depicting Lord Hanuman driving a car, with Ganesha, Shiva, and Vishnu sitting in the car. pic.twitter.com/bZTwvw67Xj
— Risav Bajpayi (@jurnorisav) January 19, 2026