Reading Time: < 1 minute
T20 World Cup 2026 Prize Money How Much India New Zealand And Other Teams Earned

T20 World Cup 2026 Prize Money: అహ్మదాబాద్‌ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన వరల్డ్ కప్ 2026 ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ పై భారీ ఘన విజయం సాధించింది. దీనితో న్యూజిలాండ్ మూడోసారి టీ20 ప్రపంచకప్ ను ముద్దాడింది. ఈ విజయంతో భారత్ మూడుసార్లు గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా స్వదేశంలో టీ20 వరల్డ్ కప్ గెలిచిన మొదటి జట్టుగా కూడా నిలిచింది.

మార్చి 28న ప్రారంభం కానున్న IPL 2026.. త్వరలో పూర్తి షెడ్యూల్ విడుదల.!

ఈ విజయంతో భారత జట్టుపై భారీగా నగదు వర్షం కురిసింది. టోర్నమెంట్ నిర్వహించిన ఐసీసీ ఈసారి మొత్తం ప్రైజ్ మనీ పూల్‌ ను రూ.120 కోట్లుగా నిర్ణయించింది. ఇందులో విజేతగా నిలిచిన భారత్‌కు అత్యధిక భాగం లభించింది. భారత జట్టు విజేతగా 3 మిలియన్ అమెరికన్ డాలర్లు (రూ.27.48 కోట్లు) ప్రైజ్ మనీగా అందుకుంది. గత ఎడిషన్‌ తో పోలిస్తే ఈ మొత్తం కాస్త ఎక్కువ. గతసారి ఛాంపియన్‌ గా నిలిచినప్పుడు భారత్‌ కు 2.34 మిలియన్ డాలర్లు (రూ.23 కోట్లు) మాత్రమే లభించాయి.

Sanju Samson: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. టీ20 వరల్డ్ కప్‌లో సంజూ శాంసన్ సరికొత్త చరిత్ర!

ఫైనల్లో ఓడిపోయినప్పటికీ న్యూజిలాండ్ జట్టుకు కూడా ప్రైజ్ మనీ బాగానే లభించింది. రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ కు 1.6 మిలియన్ డాలర్లు (రూ.14.65 కోట్లు) అందించారు. సెమీఫైనల్‌ లో పరాజయం పాలైన సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లకు చెరో 7.9 లక్షల డాలర్లు (సుమారు రూ.7.24 కోట్లు) చొప్పున ప్రైజ్ మని లభించింది. అదేవిధంగా సూపర్-8 దశ వరకు చేరుకుని సెమీఫైనల్‌కు చేరలేకపోయిన ప్రతి జట్టుకు 3.8 లక్షల డాలర్లు (రూ.3.48 కోట్లు) ప్రైజ్ మనీగా అందించారు. గ్రూప్ స్టేజ్‌లో పాల్గొన్న అన్ని జట్లకు కూడా 2.5 లక్షల డాలర్లు (రూ.2.29 కోట్లు) లభిస్తాయి.