Reading Time: < 1 minute
Modi Trump Phone Call Middle East Tensions Hormuz Crisis

మధ్యప్రాచ్యం ఉద్రిక్తతల వేళ ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరి నాయకుల మధ్య కీలక సంభాషణ జరిగింది. హార్ముజ్ జలసంధి, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై ఇరువురి మధ్య సంభాషణ జరిగినట్లుగా భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఎక్స్‌లో వెల్లడించారు.

గత నెల 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యారు. అనంతరం ఇరాన్ ప్రతీకార దాడులతో చెలరేగిపోయింది. గల్ఫ్ ఇంధన క్షేత్రాలపై క్షిపణులతో విరుచుకుపడింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని మూసేసింది. దీంతో ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో ప్రధాన మోడీకి ట్రంప్ ఫోన్ చేసి చర్చించారు.