Reading Time: < 1 minute

సంగారెడ్డి జిల్లా ఇంద్రేశంలో భారీ అగ్నిప్రమాదం.. ప్లాస్టిక్ గోదాంలో మంటలు

Caption of Image.

సంగారెడ్డి జిల్లా ఇంద్రేశంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాస్టిక్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగసిపడుతున్న క్రమంలో దట్టమైన పొగ కమ్మేసింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. 

ఇంద్రేశం మున్సిపాలిటీలో ఎన్నికలు జరుగుతున్న క్రమంలో గోదాంలో సిబ్బంది ఎవరు లేరని తెలుస్తోంది. ఈ ఘటనలో ప్రాణనష్టం ఏమీ సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

©️ VIL Media Pvt Ltd.