
ఏపీ, తెలంగాణలోనూ శనివారం చలి పంజా విసిరింది. ఒకవైపు చలి తీవ్రత.. మరోవైపు పొగమంచుతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఏజెన్సీ ప్రాంతాలు, మన్యం ఏరియాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. అరకులో 4, మినుములూరులో 5, పెదబయలులో 6.7.. జీకేవీధి, ముంచంగిపుట్టులో 6.8, పాడేరులో 7, జి.మాడుగులలో 7.3, హుకుంపేటలో 8.6, చింతపల్లిలో 4.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలో వాహనదారులకు వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది. వాహనదారులు ఫాగ్ లైట్లు వేసుకొని నెమ్మదిగా వెళ్లాలని సూచించారు. ఉదయం 10 గంటలైనా పొగమంచు వీడటంలేదు. మరికొన్నిరోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని జాగ్రత్తలు పాటించాలని వాతావరణశాఖ సూచించింది.
మరిన్ని వీడియోల కోసం :