
భద్రాద్రి జిల్లా చర్ల మండలంలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు వీరాభిమాని ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొని రంగు రంగుల రంగవల్లులను అందంగా తీర్చిదిద్దారు. తెలుగు ప్రజలకు పెద్ద పండగైన సంక్రాంతి.. హరిదాసులు, భోగి మంటలు, చెరకు గడలు, పాడిపంటలతో కళకళలాడింది. ఇక తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఆడపడుచులు వేసిన ముగ్గులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా గెలుపు ఓటములతో సంబంధం లేకుండా కొత్తపల్లి వారి సంక్రాంతి ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలందరికీ పట్టు చీరలను బహూకరించారు నిర్వాహకులు. పండగవేళ తాము గెలుచుకున్న పట్టుచీరలు చూసుకొని తెగ మురిసిపోయారు మహిళలు.