Reading Time: < 1 minute
Pm Modi Speaks With Kuwait Crown Prince Eid West Asia Discussion

ప్రధాని మోడీ కువైట్ యువరాజు షేక్ సబా అల్-ఖాలిద్‌కు ఫోన్ చేశారు. రాబోయే ఈద్ పండుగ సందర్భంగా కువైట్ యువరాజుతో సంభాషించారు. ఈద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

కువైట్ యువరాజుతో సంభాషించిన విషయాలను ప్రధాని మోడీ ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘‘పశ్చిమ ఆసియాలో నెలకొన్న పరిస్థితులపై మేమిద్దరం అభిప్రాయాలు పంచుకున్నాం. ఇటీవలి పరిణామాలపై ఆందోళనలను తెలియజేశాం. కువైట్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతపై జరిగిన దాడులను భారతదేశం ఖండిస్తోందని పునరుద్ఘాటించాము. హార్ముజ్ జలసంధి గుండా సురక్షితమైన, స్వేచ్ఛాయుతమైన నౌకాయానాన్ని నిర్ధారించడం మా ప్రధాన ప్రాధాన్యతగా ఉంది. ప్రాంతీయ శాంతి, స్థిరత్వం కోసం నిరంతర దౌత్య సంబంధాలు అవసరమని మేమిద్దరం అంగీకరించాం. కువైట్‌లోని భారతీయ సమాజం యొక్క భద్రత, శ్రేయస్సు కోసం అందిస్తున్న నిరంతర మద్దతుకు నేను ధన్యవాదాలు తెలిపాను.’’ అని మోడీ ట్వీట్ చేశారు.

ఇది కూడా చదవండి: Iran-Israel: మరో టాప్ లీడర్‌ను లేపేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ నిఘా మంత్రి హతం అయినట్లు ప్రకటన

గత నెల 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యారు. అనంతరం ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేసింది. దీంతో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. అప్పట్లోనే గల్ఫ్ అధినేతలతో మోడీ సంభాషించారు.