
Petrol, Diesel Prices Hiked: వాహనాదారులకు షాకింగ్ న్యూస్. గత కొన్ని రోజులుగాపశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Crude Oil) ధరలు పెరగడం వల్ల దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 3 రూపాయలు, డీజిల్పై 3 రూపాయలు పెరిగింది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వచ్చాయి.
ముడి చమురు ధరల పెరుగుదల,రూపాయి విలువ క్షీణించడం వల్ల చమురు సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. దీనివల్ల రవాణా ఖర్చులు పెరిగి, సామాన్యులపై భారంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.