Reading Time: < 1 minute
గోవిందరాజు స్వామి ఆలయంలో 50 కేజీల బంగారం మాయం చేశారు

జనసేన నేత కిరణ్ రాయల్ తిరుపతిలోని ప్రసిద్ధ గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం మాయమైందని కీలక ఆరోపణలు చేశారు. ఆలయంలో బంగారు తాపడం పనులు జరుగుతున్న సమయంలో ఈ అవకతవకలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. అన్యమతస్థులకు బంగారు తాపడం పనులు అప్పగించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆలయ గోపురంపై ఉన్న పురాతన విగ్రహాలను తొలగించి తాపడం పనులు చేశారని, ఇది ఆలయ చరిత్రకు, సంప్రదాయాలకు విరుద్ధమని కిరణ్ రాయల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. 2022-23 సంవత్సరానికి సంబంధించిన బంగారు తాపడం రికార్డులను పరిశీలించడానికి తమకు అనుమతి ఇవ్వాలని కిరణ్ రాయల్ ప్రభుత్వాన్ని కోరారు. 50 కేజీల బంగారం మాయం కావడంపై సమగ్ర దర్యాప్తు చేయాలని, దోషులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

KTR: కేసీఆర్ బయటకు వచ్చి గర్జిస్తే దానికి సమాధానం చెప్పలేకపోయారు

బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులకు నిరసనగా VHP ఆందోళన

ఢిల్లీలో నకిలీ ఇన్సూరెన్స్ అధికారుల మోసాలు

CM Chandrababu Naidu: కొత్త టెక్నాలజీ తీసుకొచ్చే బాధ్యత మాది

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం ఎంత అంటే ??