
Earthquake In Ongole: ఒంగోలు నగరంలో శుక్రవారం రాత్రి స్వల్ప భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ముఖ్యంగా దేవుడు చెరువు, నెల్లూరు బస్టాండ్, మామిడిపాలెం ప్రాంతాల్లో ఈ ప్రకంపనల ప్రభావం స్పష్టంగా కనిపించినట్లు స్థానికులు తెలిపారు. రాత్రి సమయంలో ఇళ్లలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆకస్మికంగా భూమి కంపించినట్లు ప్రజలు పేర్కొన్నారు. కొంతసేపు ఇళ్లలోని ఫ్యాన్లు, కిటికీలు స్వల్పంగా కంపించడంతో చాలామంది ఇళ్ల బయటకు పరుగులు తీశారు. అయితే, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఇప్పటివరకు సమాచారం లేదు. భూ ప్రకంపనల విషయమై స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. ప్రకంపనల తీవ్రత ఎంత మేరకు నమోదైందన్న విషయంపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.. అయితే, గతంలోనూ పలుసార్లు ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు సంభవించిన విషయం విదితమే..
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?