Reading Time: 2 minutes
Ram Charan Peddi Movie Chiranjeevi Sukumar Visit Shooting Set

రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘పెద్ది’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా సెట్స్‌ను మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు సుకుమార్ సందర్శించారు. షూటింగ్ జరుగుతున్న తీరును చూసి వారు చిత్ర బృందాన్ని అభినందించారు. దీనికి సంబంధించిన ఫోటోలను జియో స్టూడియోస్ తమ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ, ఇవి తమకు ఎంతో ఆత్మీయమైన క్షణాలని పేర్కొంది. కాగా ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన ప్రతి ఒక్క అప్‌డేట్ మంచి రెస్పాండ్ అందుకోగా..

ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నట్లు కూడా ప్రకటించేశారు. దీనికి ముందు రోజు, అంటే జూన్ 3న భారీ స్థాయిలో ప్రీమియర్ షోలను ప్లాన్ చేశారు. సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో, త్వరలోనే సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాస్ లుక్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది.