Reading Time: < 1 minute
వేముల వాడ ఆలయంలో నాగు పాము ప్రత్యేక్షం.. భయం భయంగా భక్తులు

కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీయగా, అధికారులు స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ నాగుపామును పట్టుకుని పట్టణ శివారులోని నిర్మానుష్య ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ ఘటనతో అప్పటికి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నప్పటికీ, అసలు సమస్య మాత్రం అలాగే మిగిలిపోయింది. ఇది తొలిసారి కాదు. గతంలోనూ ఇదే తరహా ఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం, వసతి గృహల వద్ద తరచూ పాములు దర్శనమవుతుండటం భక్తులను వణికిస్తోంది. దర్శనానికి వచ్చే భక్తులు, వసతి గృహాల్లో బస చేసే యాత్రికులు రాత్రివేళ బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్థానికుల మాటల్లో ఆలయ పరిసరాల్లోని పాత భవనాలు, పాడైపోయిన నిర్మాణాలు, చెత్త పేరుకుపోవడం, పాములకు ఆలయ పరిసరాలను సురక్షిత ఆశ్రయంగా మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. దేవస్థానం పరిధిలో భక్తుల ప్రాణ భద్రతకు హామీ ఇవ్వాల్సిన అధికారులు ఇప్పటికైనా మేల్కొనాలని భక్తులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.