Reading Time: < 1 minute
PM Modi: ఫ్రెడరిక్ మెర్జ్ తో కలిసి కైట్ ఫెస్టివల్‌ లో పాల్గొన్న ప్రధాని మోదీ

అహ్మదాబాద్‌లోని సబర్మతీ నదీ తీరం వద్ద అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ సందడి నెలకొంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ పాల్గొన్నారు. పతంగులను కేవలం పిల్లలు లేదా యువకులు మాత్రమే కాకుండా, రెండు దేశాల అధినేతలు స్వయంగా ఎగురవేశారు. ఈ సందర్బంగా భారత్-జర్మనీ దోస్తీ అహ్మదాబాద్ గగనతలంలో స్పష్టంగా కనిపించింది. ఇద్దరు నేతలు తమ తమ దేశాల పతాకాలను పోలిన పతంగులను ఎగురవేసి, ఇరు దేశాల మధ్య పటిష్టమైన సంబంధాలను, మైత్రీ బంధాన్ని చాటి చెప్పారు. సబర్మతీ రివర్ ఫ్రంట్‌ వద్ద జరిగిన ఈ కార్యక్రమం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది, భారత్, జర్మనీల మధ్య పెరుగుతున్న ద్వైపాక్షిక సంబంధాలకు వేదికగా నిలిచింది. ఈ పండుగ వాతావరణం భారత్-జర్మనీ మైత్రీ బంధాన్ని మరింత బలోపేతం చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Trump: నేనే వెనిజులా అధ్యక్షుడినంటూ ట్రంప్‌ పోస్ట్‌

10 వేల అడుగులా.. 45 నిమిషాల వ్యాయామమా.. ఫిట్‌నెస్‌ కోసం ఏది బెస్ట్‌ ??

చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో అద్భుత దృశ్యం

ఉదయాన్నే పొలానికి వెళ్తున్న రైతులు.. దారిలో సీన్‌ చూసి పరుగులు

వరి పొలం బురదలో దిగి.. నాట్లు వేసిన డిప్యూటీ కలెక్టర్ హరిణి