
నివిన్ పౌలీ నటించిన మలయాళ పొలిటికల్ థ్రిల్లర్ ప్రతిఛాయ ఏప్రిల్ 24 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లోనూ పలు కొత్త సినిమాలు, డబ్బింగ్ చిత్రాలతో పాటు ప్రతిఛాయ డిజిటల్ ప్లాట్ఫామ్లపై అందుబాటులోకి వచ్చింది.ఈ సినిమా కథ కేరళ రాజకీయాల చుట్టూ తిరుగుతుంది. నిజాయితీపరుడైన ముఖ్యమంత్రి వర్గీస్ ను ఒక మహిళ లైంగికంగా వేధించాడని ఆరోపించడంతో ఆయన రాజీనామా చేస్తారు. వర్గీస్ పెద్ద కొడుకు జాన్ (నివిన్ పౌలీ) తన తండ్రిపై పడిన మచ్చను చెరిపేసేందుకు రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో అతనికి షాకింగ్ నిజాలు తెలుస్తాయి. దశాబ్దం క్రితం కేరళ రాజకీయాలను కుదిపేసిన ఒక సంఘటన ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఉన్ని కృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జియో హాట్స్టార్లో తెలుగు వెర్షన్లోనూ వీక్షించడానికి అందుబాటులో ఉంది.
మరిన్ని వీడియోల కోసం :
రీ రిలీజ్లైనా చేయొచ్చుగా..సమ్మర్ను ఖాళీగా వదిలేస్తున్నారెందుకు
చిన్న సినిమాలకే పరిమితమవుతున్న తెలుగమ్మాయిలు
ధురంధర్ జోరుకు బ్రేక్ వేసిందెవరు..?
క్లాస్ టు మాస్.. మాస్ టు క్లాస్ రూటు మారుస్తున్న టాప్ స్టార్స్