Reading Time: 2 minutes
Whats Today On 25th April 2025

* ఇవాళ IPLలో రెండు మ్యాచ్‌లు.. మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీ వేదికగా పంజాబ్‌-ఢిల్లీ మ్యాచ్‌.. రాత్రి 7.30 గంటలకు జైపూర్‌ వేదికగా హైదరాబాద్-రాజస్థాన్‌ మ్యాచ్‌

* అమరావతి: ఇవాళ ఉదయం 11 గంటలకు.. విజయవాడలో నోవాటేల్ కు సీఎం చంద్రబాబు. 11.45 కు లోక్ భవన్ కు సీఎం చంద్రబాబు.. హై కోర్ట్ చీఫ్ జస్టిస్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు .. మధ్యాహ్నం 1 గంటకి ముంబై వెళ్లనున్న సీఎం చంద్రబాబు….

* అమరావతి : ఇవాళ తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో దళిత గళ సమ్మేళనం కార్యక్రమం.. వైసీపీ రాష్ట్ర ఎస్సీ విభాగం అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు అధ్యక్షతన సమావేశం.. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్న పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణా రెడ్డి..

* కాకినాడ: నేడు అన్నవరంలో పంపా ఆక్విడెక్ట్ దగ్గర పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులను పరిశీలించనున్న మంత్రి నిమ్మల. పనుల పురోగతిపై అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించనున్న మంత్రి రామానాయుడు

* కాకినాడ: నేడు ఎమ్మెల్సీ అనంతబాబును మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చనున్న పోలీసులు.. సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించిన కేసులో ఎమ్మెల్సీ ను నిన్న అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వైద్య పరీక్షల కోసం జీజీహెచ్ కి తీసుకుని వెళ్లి, అక్కడ నుంచి కోర్టుకి తరలించనున్న పోలీసులు

* తిరుమల: ఇవాళ నుంచి మూడు రోజులు పాటు శ్రీవారి వార్షిక పద్మావతి పరిణయోత్సవాలు.. మూడు రోజులు పాటు ఆర్జిత బ్రహ్మోత్సవం,సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు

* తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపల క్యూలైన్‌లో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 69,270 మంది భక్తులు .. తలనీలాలు సమర్పించిన 33,180 మంది భక్తులు .. హుండీ ఆదాయం రూ.3.69 కోట్లు

* గుంటూరు: నేడు వైసీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద మొక్కజొన్న రైతు పోరాటదీక్ష. మొక్కజొన్నను మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చెయ్యాలని డిమాండ్. ఎనిమిది గంటలనుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ దీక్ష. పాల్గొనున్న గుంటూరు జిల్లా వైసీపీ నేతలు

* విజయవాడ: ఇవాళ, రేపు, ఎల్లుండి FAPTO పోరుబాట.. 12వ వేతన సవరణ సంఘాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలి. 30% మధ్యంతర భృతిని ప్రకటించాలి. పంచాయతీరాజ్ యాజమాన్యంలో పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలను తక్షణమే చేపట్టాలి. కలెక్టర్ పూల్ ద్వారా వెంటనే పోస్టింగులు ఇవ్వాలి. ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యలు పరిష్కరించి విద్యాశాఖలో ఉన్న అసంబద్ధతను తొలగించాలి. 72, 73, 74 జీవోలు అమలు చేయాలని డిమాండ్‌

* ఈ రోజు కొత్త పార్టీ ప్రకటన చేయనున్న కల్వకుంట్ల కవిత.. పార్టీ ప్రకటన సభకు అట్టహాసంగా ఏర్పాట్లు.. మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర అద్వయ కన్వెన్షన్ లో పార్టీ ప్రకటన సభకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రాంగణం గా పేరు.. గన్ పార్క్ లో అమరవీరులకు నివాళులర్పించి అద్వయ కన్వెన్షన్ కు బయల్దేరనున్న కవిత.. ఉదయం 10 గంటలకు పార్టీ పేరు ప్రకటన, జెండా ఆవిష్కరణ.. కవిత పార్టీ పేరు తో పాటు ఆమె స్పీచ్ పై ఉత్కంఠ .. పార్టీ ప్రకటన తరవాత గంటన్నర పాటు ప్రసంగించనున్న కవిత

* మెదక్: నేడు నర్సాపూర్ లో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన .. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి వివేక్

* ఖమ్మం: నేడు ఖమ్మం పాలేరు నియోజకవర్గం లో ప్రజా దర్బార్ లను ప్రారంభించనున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

* భద్రాచలం అభివృద్ధి పనులకు రేపటి నుంచి శ్రీకారం. దేవాలయంలోని ఒక ఆలయాలలలో మరో చోటికి తరలించేందుకు ఏర్పాటు.. భద్రాద్రి చిన్న జీయర్ స్వామి నేతృత్వంలో భద్రాచలంలోని రామాలయంలో జీ నూతన కార్యక్రమము.. జీర్నోదరణకు పొడిచేటి రామచంద్ర చార్యుల ఆధ్వర్యంలో ఏడుగురితో కమిటీ ఏర్పాటు..

* తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలతో ప్రభుత్వం చర్చలు సఫలం.. 11 శాతం పీఆర్సీ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, సంఘాల ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్.. మిగిలిన అంశాల పరిష్కారానికి అంగీకరించిన ఆర్టీసీ యాజమాన్యం