Reading Time: < 1 minute

కోటి కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం: గవర్నర్ రిపబ్లిక్ డే స్పీచ్ హైలైట్స్

Caption of Image.

తెలంగాణలో కోటి కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో  పాల్గొన్న గవర్నర్ .. తెలంగాణ ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్.. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ తో పనిచేస్తున్నామని తెలిపారు. గ్లోబల్ సమ్మిట్తో మన విజన్ ఆవిష్కరించామని చెప్పారు. 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యంతో పనిచేస్తూ వికసిత్ భారత్ కు అనుగుణంగా ముందుకు వెళ్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు.

 గవర్నర్ స్పీచ్ హైలైట్స్:

  • రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
  • తెలంగాణ రైజింగ్ 2047 విజన్ తో పనిచేస్తున్నాం
  • గ్లోబల్ సమ్మిట్ తో మన విజన్ ఆవిష్కరించాం
  • RRR పూర్తి చేసి అభివృద్ధి పరుగులు పెట్టిస్తాం
  • డిసెంబర్ 9న ఘనంగా తెలంగాణ తల్లి  అవతరణ వేడుకలు
  • అందెశ్రీ రాసిన జయజయహే గీతాన్ని రాష్ట్ర గీతంగా ఆమోదించుకున్నాం
  • మేడారంలో చారిత్రాత్మకంగా కేబినెట్ నిర్వహించుకున్నాం
  • ఆదివాసీ  జాతర మేడారం జాతరను ఘనంగా నిర్వహిస్తున్నాం
  • వందల కోట్లతో మేడారం గద్దెలను ఆధునీకరించాం
  • వ్యవసాయ ఆధునీకరణకు చర్యలు తీసుకుంటున్నాం
  • సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నాం
  • బలమైన ఎడ్యుకేషన్ వ్యవస్థలను రూపొందించి అమలు చేస్తున్నాం
  • మహిళా సంఘాలను బలోపేతం చేస్తున్నాం
  • పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులకు ఓనర్లను చేస్తున్నాం
  • విజయవంతంగా గ్రూప్స్ పరీక్షలు నిర్వహించాం
  • యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని అభివృద్ధి చేస్తున్నాం
  • ఫ్యూచర్ సిటీలో యంగ్ ఇండియా వర్సిటీని తీర్చి దిద్దుతాం
  • ధరణి స్థాణంలో భూభారతి తీసుకొచ్చాం
  • ఐటీఐలను అభివృద్ధి చేసి యువతకు ఉపధి కల్పిస్తున్నాం
     
©️ VIL Media Pvt Ltd.