Reading Time: < 1 minute
Maniratnams Next With Vijaysethupathi Saipallavi Music By Ar Rahman And Produced By Lyca Productions

తనదైన నటనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు విజయ్ సేతుపతి  వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్ తో జైలర్ 2 తో పాటు టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో స్లమ్ డాగ్ అనే సినిమా అలాగే మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా విజయ్ సేతుపతి నెక్ట్స్ సినిమాను ప్రకటించాడు.

Also Read : UstaadBhagatSingh Frist Day Collections : ఉస్తాద్ భగత్ సింగ్ మెుదటి రోజు కలెక్షన్స్.. డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ షాక్

 ప్రముఖ దర్శకుడు మణిరత్నం తగ్ లైఫ్ డిజాస్టర్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని పవర్ఫుల్ కధతో కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది.  సహజమైన నటనకు పేరు తెచ్చుకున్న సాయి పల్లవి, సుప్రసిద్ధ దర్శకులు మణిరత్నం డైరెక్షన్, విజయ్ సేతుపతి లాంటి పవర్‌ఫుల్ నటుడు కలిసి చేసే ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయనడంలో సందేహం లేదు. ఈ చిత్రం సేతుపతి కెరీర్ లో ఓ ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అలాగే మణిరత్నం కు చెందిన మద్రాస్ టాకీస్ సంయక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ కథను మణిరత్నం తొలుత సిలంబరాసన్ టీఆర్ శింబు కోసం రాసుకున్నారట. అయితే కొన్ని కారణాల వల్ల STR ఈ ప్రాజెక్ట్‌కు నో చెప్పడంతో అదే కథకు విజయ్ సేతుపతితో చేస్తున్నారు మణిరత్నం. నేడు అఫీషియల్ గా ప్రకటించిన ఈ సినిమాను ఆస్కార్ విన్నెర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.