
ప్రభుత్వ పాఠశాలలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినూత్నంగా వినియోగిస్తూ చేపట్టిన ప్రయోగం అందరినీ ఆకట్టుకుంది. సిరిసిల్ల పట్టణంలోని గీతానగర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశంలో రోబో టీచర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇండస్ ల్యాబ్ సంస్థ పాఠశాలకు బహూకరించిన రోబో టీచర్ తొలిసారిగా తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడి వారి ప్రశ్నలకు సమాధానాలు అందరినీ ఆకట్టుకుంది. పాఠశాలలో విద్యాబోధన, విద్యార్థుల ప్రగతి, సాంకేతికత వినియోగం తదితర అంశాలపై తల్లిదండ్రులు రోబో టీచర్ను పలు ప్రశ్నలు అడిగారు. రోబో టీచర్ సాంకేతిక పరిజ్ఞానంతో వాటికి స్పష్టమైన సమాధానాలు ఇవ్వడంతో తల్లిదండ్రులు ఆసక్తిగా గమనించారు. సాధారణంగా ఉపాధ్యాయులతో నిర్వహించే సమావేశానికి భిన్నంగా రోబోతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించడం అందరినీ ఆకట్టుకుంది.
విద్యార్థులకు పాఠ్యాంశాలను మరింత ఆసక్తికరంగా, సులభంగా అర్థమయ్యేలా చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలనే ఉద్దేశంతో రోబో టీచర్ను పాఠశాలలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు కూడా సాంకేతికత ఆధారిత బోధనపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం దోహదపడింది.
వీడియో చూడండి..
రోబో టీచర్ నేరుగా మాట్లాడటం, ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం చూసి విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆధునిక సాంకేతికతకు చోటు కల్పిస్తూ విద్యాబోధనలో కొత్త విధానాలకు శ్రీకారం చుట్టడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..