Reading Time: < 1 minute
Bjp Appoints New State Presidents For Delhi Haryana Punjab And Tripura

BJP Presidents: భారతీయ జనతా పార్టీ (BJP) అధిష్టానం తాజగా కీలక నియామకాలను ప్రకటించింది. పార్టీ బలోపేతం లక్ష్యంగా ఢిల్లీ, హర్యానా, పంజాబ్, త్రిపుర రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నియామకాలతో ఆయా రాష్ట్రాల్లో పార్టీ కార్యకలాపాలకు మరింత వేగం చేకూరనున్నట్లు బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.

ఢిల్లీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా హర్ష్ మల్హోత్రాను పార్టీ అధిష్టానం నియమించగా, పంజాబ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సర్దార్ కేవల్ సింగ్ ధిల్లాన్‌ను నియమించారు. అలాగే హర్యానా బీజేపీ అధ్యక్షురాలిగా అర్చన గుప్తాకు బాధ్యతలు అప్పగించగా, త్రిపుర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అభిషేక్ దేబ్రాయ్‌ను నియమించారు. ఈ కొత్త నియామకాల ద్వారా రాష్ట్ర స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని బీజేపీ అధిష్టానం లక్ష్యంగా పెట్టుకుంది.